మేమంతా మీ వెంటే ఉంటామంటూ మిర్జాపూర్ గ్రామస్తులు ముక్తకంఠంతో నినదించారు.బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండల్ మిర్జాపూర్ గ్రామస్తులు సుమారుగా 50 మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఏడుపాయల దుర్గామాతని దర్శించుకున్నారు.బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తో కలిసి దైవదర్శనంతో పాటు రాజకీయ చర్చలు కొనసాగించారు. ఏడుపాయల వన దుర్గ మాత సాక్షిగా ఏనుగు రవీందర్ రెడ్డి వెంటే మేముంటామని,మీరే మా నాయకులు అని, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఈసారి మోసపోమని, మీరు వచ్చాకే మాకు స్వేచ్ఛ వచ్చిందని,మీ వెంటే మేముంటాం అంటూ దేవుని సన్నిధిలో మాట ఇచ్చినా మిర్జాపూర్ గ్రామస్తులు. వీరితో పాటు నియోజకవర్గం ముఖ్య నాయకలు పలువురు ఈ రాజకీయ చర్చోప చర్చల్లో పాల్గొన్నారు.
ఏనుగు రవీందర్ రెడ్డి వెంటే మేమంతా మీర్జాపూర్
RELATED ARTICLES
