నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం యాద్గార్ పూర్ గ్రామంలో శనివారం పీర్ల పండుగ ఘనంగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాలుపంచుకున్నారు. పీర్ల పండుగ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వెయ్యి మంది గ్రామస్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులు వారిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్ , మాజీ జడ్ పి కో ఆప్షన్ సభ్యులు వలియొద్దీన్, జిల్లా మైనారిటీ కార్యదర్శి వహీద్ హుస్సేన్, కోటగిరి మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, గ్రామ అద్యక్షులు దాదు, మునవర్, మహతాబ్ మరియు వర్ని మండల నాయకులు చందా దత్తు, రెడ్డి రాంబాబు, మొయినుద్దీన్, హర్ష,శ్రీనివాస్ మరియు కార్యకర్తలు, గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
