ద్రోణ హైదరాబాద్
ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇవ్వడంతో ఆ వర్గానికి చెందినవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహ , జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ,ఎమ్మెల్యేలు కే ఆర్ నాగరాజు వారితోపాటు ఎమ్మెల్యేలు ఉన్నారు.
డప్పు దరువులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.
