చాదర్ సమర్పించిన పోలీస్ కమిషనర్
బోధన్ ద్రోణ:-

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంజల్ బేస్ సమీపంలో గల జలాల్ భుఖారి దర్గా వర్షం ఉత్సవాలు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు.

పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించినటు వంటి పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ ఉత్సవాలలో పాల్గొని ఖవ్వాలిలొ పాల్గొని చాదర్ సమర్పించి ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ సోదరా భావంతో మెలగాలని ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడు పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు. హిందూ ముస్లిం భాయి భాయి అని సోదర భావంతో మెలగాలని ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏ సి పి పి. శ్రీనివాస్, బోధన్ టౌన్ సి ఐ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్
కృష్ణ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.
