జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు
జుక్కల్ ఆగస్టు 15 ద్రోణ
పాఠశాలలో విద్యార్థులకు విద్యా, క్రమశిక్షణతో పాటు దేశభక్తిని మరింత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు.79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఎమ్మెల్యే కి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ
స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని అన్నారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు, క్రమశిక్షణతో పాటు వారిలో దేశభక్తి భావాలు పెంపొందించే విధంగా కృషి చేయాలని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.







