కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 22 ద్రోణ
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నడం ప్రజలను ఆకర్షిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడకపోవడం వల్లనే ఎల్లారెడ్డి వర్గం వెనుక పాటు గురైందని ప్రజలు చర్చలు జరుపుకుంటున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం, లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో గత 30 ఏళ్లుగా చూడని అభివృద్ధి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేవలం 20 నెలల్లోనే సాధ్యమైంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన నియోజకవర్గం. మేము కూడా భాగస్వాములు కావాలని, ప్రజల సేవలో మదన్ మోహన్ తో కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
