బాన్సువాడ సెప్టెంబర్ 24 ద్రోణ
పేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు వసతి గృహాలు ఎంతో దోహద పడతాయని శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గిరిజన బాలికల ( ఇంటర్ మరియు డిగ్రీ బాలికల ) వసతి గృహన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి
పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , జిల్లా గిరిజన అధికారి సతీష్
స్థానిక బాన్సువాడ మరియు నసురుల్లాబాద్ మండల బంజారా నాయకులు ఏర్పాటు చేసిన బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని జగదంబా మాత,సేవలాల్ మహరాజ్ చిత్రపటం వద్ద పోచారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ, నసురుల్లాబాద్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.








