
పోతంగల్ మండలం ద్రోణ
పోతంగల్ మంజీరా లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తవ్వకాలకు తెరలేపడంతో రెవిన్యూ హౌసింగ్ అధికారుల వ్యవహారంపై ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇసుక తవ్వకాలు ప్రారంభం కాగానే స్థానికులు టిప్పర్లను అడ్డుకున్నారు రైతు పొలంలో ఇసుకమేటలు పేరుకపోయాయి అని అనుమతులు తీసుకొని ఇసుక లేని చోట అనుమతులు పొంది మంజీరా లో ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి మంజీరా లో ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సర్వే చేపట్టి ఇసుక ఉన్నచోట మాత్రమే అనుమతులు ఇవ్వాలని స్థానికులు రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇందులో కొందరి అధికారుల పాత్రపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి, అభివృద్ధి పనుల పేరు పై అనుమతులు ఇసుక తరలింపుకు కొంతమంది తీసుకున్నప్పటికీ, కొంతమంది అభివృద్ధి పనులకు బదులుగా అక్రమంగా తరలిస్తున్నారని విమర్శలు సర్వోత వినిపిస్తున్నాయి, ఈ విషయాన్ని గ్రహించిన కోడిచెర్ల గ్రామస్తులు కామారెడ్డి జిల్లా సిర్పూర్ గ్రామ ప్రజలు అదేవిధంగా పొతంగల్ గ్రామ ప్రజలు కూడా ఇసుక తరలింపును అడ్డుకోవడం జరుగుతుంది ఇసుకను తరలించకుండా

మా గ్రామ మంజీరా శివారు ప్రాంతాల నుంచి ఇసుక తరలింపు జరపరాదని అడ్డుకోవడం జరిగిందని దీనిపై ఎంఆర్ఓ కూడా స్పందించి ఇసుక తరలింపునకు అవకాశం లేకుండా గుంతలు తవ్వారు అనేది చర్చ బాగానే జరుగుతుంది.
