పోలీస్ కమిషనర్ ఆదేశాలు
నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:- నిజామాబాద్ జిల్లాలోని స్కూల్ బస్సులను మరియు ప్రైవేటు

బస్సులను తనిఖీ నిర్వహించాల్సిందిగా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు పలుచోట్ల తనిఖీ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వాహనాలను తనిఖీ చేయాలని డ్రైవర్ యొక్క లైసెన్స్ వాహనాల పత్రాలను పరిశీలించి నియమ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేసి ప్రైవేటు వాహనాలలో ఫైర్ సేఫ్టీ లను తనిఖీ చేసామని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రాంతాలలో

పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐ ఎస్ఐల భద్రతతో వాహనాలను తనిఖీ నిర్వహించినట్లు ఆర్టీవో అధికారులు వెల్లడించారు.
