బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ పై సదస్సు
నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:- రాజ్యాంగ సవరణ చేసి ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ఎలాగైతే చేశారో అదేవిధంగా బీసీలకు నలబై రెండు శాతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ చంద్రశేఖర్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా చట్టాలు చేసుకునే హక్కు అప్పటిలోనే రాజ్యాంగం కల్పించిందని పది శాతం కూడా లేని కులాలకు యబై శాతం కల్పించినప్పుడు ఉన్నత కులాలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం దారుణమని అదేవిధంగా కోదండరాం మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన కులమతాలకు సరియైన రిజర్వేషన్ కల్పించినప్పుడు గౌరవప్రదమైన జీవనాన్ని సామాజిక న్యాయాన్ని పొందగలుగుతారని తెలంగాణ జన సమితి గట్టిగా సమర్థిస్తుందని అందులో భాగంగానే సదస్సు లో పలు తీర్మానాలు చేయడం.

జరిగిందని నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై జిల్లాలలో సదస్సులు నిర్వహించి హైదరాబాదుకు భారీ ఎత్తున ర్యాలీ గా అఖిలపక్షం వారితో కలిసి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి తో పాటు ఢిల్లీకి బయలుదేరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని లేకపోతే దీనిపై కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కే ఎల్ విఘ్నేశ్వరరావు, చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, మరియు కోదండరాం తదితరులు పాల్గొన్నారు.
