ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు
రోడ్డు ప్రమాదాలపై నివారణ చర్యలు

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-
ద్విచక్ర వాహనాల వాడకము చేసే ప్రజలు హెల్మెట్ తప్పనిసరి అని అన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పి సాయి చైతన్య ఐపీఎస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఇట్టి అంశము మీద షార్ట్ ఫిలిం ఏర్పాటు చేశామని ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు పోతున్నాయని ద్విచక్ర వాహనదారులు వారి తల్లిదండ్రులను, భార్యా, పిల్లలు దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ లేకుండా వాహనాలను నడపవలసిందిగా ఆయన సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వ్యక్తుల పై ఇన్సూరెన్స్ లను కట్టాలని వాహన ధ్రువీకరణ పత్రాలు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంచుకోవాలని ఆయన కోరారు.
