ఎడపల్లి ద్రోణ:-మున్నూరు కాపు కుల బంధువులు 50 మందితో జాతీయ పురస్కార అవార్డు అందజేయడం జరుగుతుంది.
తెలంగాణ మున్నూరు కాపు సంఘం క్యాలెండర్, డైరీలా ఆవిష్కరణ అవార్డు గ్రహీతల 50 మంది పేర్లను డిసెంబర్ ఒకటవ తేదీ నాడు విడుదల చేస్తాము. తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో యువత 11వ వార్షికోత్సవ అక్క కార్యక్రమాన్ని డిసెంబర్ 28 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ కార్యక్రమం హైదరాబాదులోనే నిర్వహించాలని దానికి సంబంధించిన వేదికను నవంబర్ మొదటి వారంలో చూస్తామని కులం కోసం అనునిత్యం కష్టపడుతూ కుల సేవలలో నిమగ్నమైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 మంది బంధువులను గుర్తించి జాతీయ పునస్కార అవార్డు తో పాటు సన్మానం చేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి కుల పెద్దలు, రాజకీయ ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యులు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు వద్ది రాజ్ రవిచంద్ర, కోవా లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శీను, కుల సంఘ పెద్దలు, తెలంగాణ కుల నాయకులు తదితరులు పాల్గొనడం జరుగుతుంది.
