బోర్గాం మాజీ జడ్పిటిసి మేక విజయ్
రెంజల్ ద్రోణ:- మండల కేంద్రంలోని బోర్గాం గ్రామంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మేక విజయ్ సంతోష్ నివాసంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎలక్షన్ లో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్ రెడ్డి(mpr) పాల్గొన్నారు. నూతనంగా బిజెపి పార్టీలో ఆహ్వానించిన అటువంటి జంగం శ్రీనివాస్ రెడ్డి, మైనిమోహన్, మేడపాటి ప్రకాష్ రెడ్డిని, సన్మానించారు. నీలా గ్రామంలో కొయ్య సంజు నూతన గృహప్రవేశానికి వెళ్లారు. అనంతరం మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ గొలుసుల రఘు మాతృమూర్తి చనిపోవడం వలన అనంతరం నీరండి గంగాధర్, శీను వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు క్యాతం యోగేష్, బిజెపి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక సంతోష్, మైని మోహన్, శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
