సిపి ఐ ఎం ఎల్ మాస్ లైన్
బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ పిలుపు
రెంజల్ ద్రోణ:- బోధన్ డివిజన్ కార్యదర్శి ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని బోర్గం గ్రామం లో అమరవీరుల సంతాప సభ జరిగింది. డివిజినల్ కార్యదర్శి డి రాజేశ్వర్, ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ రాయల చంద్రశేఖర్, దొరన్న, ఎల్లన్న, యాదగిరి ,శవులం సాయన్న, వేములపల్లి కిరణ్ కుమార్, ఎందరో అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను ఉద్యమంలో అర్పించారని అన్నారు. అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని వారి ఆశయం నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయ్యేంతవరకు పోరాడడం తప్ప మరో మార్గం లేదని కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాల రాసే నాలుగు లేబర్ కోడులను అమలుపరిచింది. ఈ కోడులకు వ్యతిరేకంగా, అనేక పోరాటాలు నిరుద్యోగ సమస్యలను పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ఎంతో సిగ్గుచేటుగా ఉందని దీనిని వెంటనే ప్రభుత్వమే వెనకకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బడ్డెన్న, షేక్ నజీర్, మోహన్, పశువుల లక్ష్మణ్, నాగోల్ల లక్ష్మణ్, శారద, సవిత, సుజాత, లక్ష్మి, సరిత, గంగామణి, నాగమణితో, పాటు కార్మికులు పాల్గొన్నారు.
