Wednesday, February 11, 2026

మూడవ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

రాష్ట్ర పౌర హక్కుల సంఘం

బోధన్ టౌన్ ద్రోణ:-తెలంగాణ రాష్ట్ర (సి ఎల్ సి) మూడవ మహాసభలు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 8, 9 తేదీలలో జరుగుతున్న నేపథ్యంలో పోస్టర్లు ఆవిష్కరణ చేశారు.
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వి. సంఘం అడ్వకేట్ మాట్లాడుతూ పౌర సంఘం గత ఐదు శతాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ బలోపేతం మైన వారు హక్కుల ఉద్యమాన్ని నిరసిస్తూ త్యాగాలతో ముందుకు సాగుతున్నదని సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం ఒకవైపు నిర్బంధాన్ని ఎదుర్కొంటూ మానవ హక్కుల ఉద్యమాన్ని చేస్తూ ముందు వరుసలో ఉందని అన్నారు. ఉద్యమంలో పోరాడుతూ ఎంతోమంది నేతలు ప్రాణాలర్పించారు రాజ్యం బూటకపు ఎన్ కౌంటర్ లలో ఉద్యమకారులను హత్యలు చేసిందని, ఇప్పటివరకు జరిగిన ఎన్ కౌంటర్ లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని అన్నారు. వాటికి కారకులైన వారిపై కేసులు నమోదు చేసి, జీవించే హక్కు, భావ ప్రకట నా స్వేచ్చకై పౌర హక్కుల సంఘం పోరాడుతుందని, మరోవైపు ప్రభుత్వ వర్గాలు ప్రాంతం, జాతి, మతం, కులాల పేర్లతో కొనసాగుతున్న అన్ని రూపాలలోని అణచివేతను హక్కుల సంఘం ప్రశ్నిస్తుందని మధ్య భారత ఆదివాసి ప్రాంతాలలో ఎయిర్ బాంబింగ్ ద్వారా అమాయక ఆదివాసీలను వారి మహిళల పట్ల అరాచకాలను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది. మధ్య భారత దేశంలో దట్టమైన అడవులలో విస్తారమంతమైన కనిజ సంపదను దాచుకోవడానికి ఆదివాసులను అడవి నుండి తరిమి వేయడానికే ప్రభుత్వ బూటకపు ఎన్కౌంటర్ లకు పాల్పడుతుందని రాజ్యాంగం కల్పించిన 1/70 చట్టం, ఐదవ షెడ్యూల్ కొరకై పేసా చట్టం అమ్మలు చేయాలని ప్రభుత్వం ముల్లంగిస్తున్నదని అన్నారు. మరోవైపు ఆపరేషన్ కాగలరు. వ్యతిరేకంగా ఆదివాసీ ప్రాంతాలలో మోహరించిన పోలీస్ బలగాలను ఎత్తివేయాలని, పోరాడుతున్న ప్రజల న్యాయం పైనే డిమాండును అంగీకరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబు దారిగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులపాటు జరిగే మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, పౌర సమాజం, పాల్గొనాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular