జిల్లా కలెక్టర్ హెచ్చరిక
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని కస్తూరిబా పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ , మరియు డీఈఓ, బోధన్ తో కలిసి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV), బోధన్ లో పాఠశాల మరియు హాస్టల్ సదుపాయాలపై తనిఖీ నిర్వహించారు. భవనాల స్థితి, తరగతి గదులు, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, వంటశాల, హాస్టల్ గదులు మరియు పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే స్థలం మరియు మౌలిక వసతుల లభ్యతను అంచనా వేసి, చిన్నపాటి మరమ్మతుల అవసరం ఉన్నట్లు గుర్తించి, అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు సంస్థ సజావుగా పనిచేసేలా నిర్వహణ, భద్రత, పారిశుధ్యం మరియు పరిశుభ్రతను కాపాడాలని ప్రిన్సిపాల్కు సూచనలు జారీ చేశారు.

