Saturday, April 18, 2026

రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

పోలీస్ కమిషనర్ వెల్లడి

రోడ్డు ప్రమాదాలను నివారించడమే పోలీస్ శాఖ లక్ష్యంగా ఎంచుకున్నట్లు కమిషనర్ సాయికుమార్ స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం , ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించనున్నట్లు సిపి స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా నేడు 6వ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లకు సంబంధించినటువంటి ఎస్సైలు, సీ.ఐ లు, ఏ.సీ.పీ లు మరియు నిజామాబాద్ జిల్లా అదనపు డి.సి.పి (అడ్మిన్) మరియు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద ప్రజలతో మరియు డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం లో * నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం , మద్యం సేవించి వాహనం నడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం , ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలియజేసారు. కోవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025 లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని తెలియజేశారు.రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి మరణాలు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని ఇట్టి కృషి అనేది ప్రతి ఒక్కరీ,నుండి మొదలవ్వాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో అట్టి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తారో , అతనికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించుట కోసం సహార్విర్ పథకం కింద 25 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
కరపత్రాలు,మరియు పోస్టర్లను విడుదల చేసారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీ.ఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై శ్రీ రామ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి , రెంజల్ ఎస్సై చంద్రమోహన్ , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రజలు/ఆర్టీసీ డ్రైవర్లు/ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular