నిజామాబాద్ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ఉండి పోరాడితే బాల్కొండలో కూడా బలమైన నాయకత్వం ఉందని పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ ఓట్లను సాధించి తీరుదామని తాహెర్ బిన్ హంద్దన్ ధీమా వ్యక్తం చేశారు. నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. శాసనసభ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు బాల్కొండ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి బరిలో ఉండడం నిజాంబాద్ ప్రజల అదృష్టంగా భావించాలన్నారు. జీవన్ రెడ్డికి రాజకీయంగా అపార అనుభవం ఉందని వ్యక్తిత్వం గల మహోన్నత వ్యక్తిని ఏనాడు డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వలేదని ప్రజల శ్రేయస్సు కోరే పని చేస్తూ ఉంటారని కొనియాడారు. గతంలో అధికారం లేని సందర్భంలోనే బాల్కొండలో సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటారని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగడం మనకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో బలం చేకూరుతుందన్నారు.

ముఖ్యమంత్రి ప్రతినిత్యం నిజాంబాద్ జిల్లాపై ప్రత్యేక కన్ను పెట్టారని నిజాంబాద్ జిల్లాలోని నాయకులకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని మేము కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తాహేర్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 14 కు పైగా పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్ప లేదని గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ఎన్నికల హామీలు అన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, మండ వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అరకల నర్సారెడ్డి తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
