మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

బిజెపి పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిటో మొదట నిరూపించుకోవాలని, బి ఆర్ ఎస్ పార్టీ దళపతి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని నీటి మరియు పౌర సరఫరాల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో మండల, పట్టణ పార్టీల వరుస సమావేశాలు నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బి ఆర్ ఎస్ పని అయిపోయిందని, పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని ఓట్లు అడిగే హక్కు బిజెపి కి లేదని ఉత్తమ్ అన్నారు.
