కళ్యాణంలో పాల్గొన్న ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్








నిజాంబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లిలోని ఇందూర్ తిరుమల వెంకటేశ్వర ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బుధవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికి వేద పండితులు చరణతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోడ భాస్కర్, కొట్టం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
