ప్రభుత్వ ఆసుపత్రిలో 32 ఏసీలు ఏర్పాటు రోగుల ఆనందం
వేసవి కాలం దృష్ట్యా నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ లో చిన్న పిల్లల ఆరోగ్యం కోసం మెటర్నిటీ వార్డు మరియు NICU వార్డు లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 32 ఏసీ లు వార్డుల్లో ఏర్పాటుచేసి తన ఉదారతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రత్యేక రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఎన్నో సేవలను ప్రజలకు అందిస్తున్నారు.గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మానవత్వంతో Ac లు పెట్టించిన మంత్రి కి రోగులు వారి బంధువులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
