సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి శెట్కర్, ఇంచార్జ్ ఏనుగు కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి మరియు పోతంగల్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు డిసిసి డెలిగేట్ హనుమంతు తెలిపారు.శుక్రవారం జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సురేష్ షెట్కార్ తో కలిసి గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి సాయంత్రం 5:00 గంటలకు కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్ లో కోటగిరి మరియు పొతంగల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు .ఈ సమావేశాలలో ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి *సురేష్ శేట్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గిరిజ షెట్కార్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి* పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పోతంగల్ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయగలరని మనవి.
