బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను మాజీ మంత్రి కప్పారు. బుద్ధి రాజేశ్వర్ ఏ పార్టీలో ఉన్న అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు ఆనాటి నుండి నేటి వరకు సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంద్దన్, డిసిసి డెలిగేట్ సభ్యులు గంగా శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, హున్సా విండో అధ్యక్షులు రవి, తదితరులు పాల్గొన్నారు.




