బాన్సువాడ లో అభివృద్ధి చేసి చూపెడతా ఏనుగు

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీ భారీ మెజార్టీతో గెలిపిస్తే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపెడతానని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.చందూర్ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండలంలో నిర్వయించిన జహీరాబాద్ పరిధిలోని నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కార్ గిరిజ శెట్కార్ , శ్రీనివాస్ శెట్కార్ మరియు మోస్రా చందూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
