బాలా గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం ఐలపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. లింగంపేట్ మండలం ఐలపూర్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ తాడూరి బాలాగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా గ్రామ మహిళలతో ముచ్చటించి, కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించారు. పార్లిమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి శెట్కార్ ని గెలిపించాలని కోరారు.



