బీఆర్ఎస్కు షాక్
*ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనమోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు హామీల పథకాలు ప్రజలకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
