ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన మొదటి ద్వితీయ సంవత్సరం ఫలితాలను నేడు వెలువరించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సంగీతకు లభించింది. నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన సతీష్ కుమార్తె. బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు పల్లెంపాటి శివన్నారాయణ, ఆంధ్ర బ్యాంక్ పదవీ విరమణ పొందిన అప్పారావు, రావెళ్ల శ్రీనివాసరావు సంగీతకు అభినందనలు తెలిపారు. విద్యాభివృద్ధిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఇలానే భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి కామా సంఘం ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉంటాయని కమ్మ సంఘ ప్రతినిధులు స్పష్టం చేశారు. తమ సామాజిక వర్గానికి కాకుండా జిల్లాకు మరియు ఈ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు సంపాదించిన విద్యార్థినికి వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంగీత
RELATED ARTICLES
