నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి బుధవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు అందజేశారు. ఆయన వెంట మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, మాజీ ఎమ్మెల్యే వాటర్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు ఉన్నారు.
