ద్రోణ హైదరాబాద్
రెండు రోజులుగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాళ నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు మరో రెండు రోజుల్లో జూరాల కూడా నిండనుంది. ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్కు నీటిని వదలనున్నారు. మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.
