ద్రోణ బోధన్
ప్రమాద రహిత వారోత్సవాలలో భాగంగా ప్రారంభోత్సవ వేడుకలు బుధవారం జరుపు కొన్నారు. ముఖ్య అతిథిగా బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్ , విశిష్ట అతిథిగా ఎం.వి.ఐ శ్రీనివాస్ హాజరైనారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినారు. అలాగే ఉత్తమ డ్రైవర్లకు నగదు ప్రోత్సాహక బహుమతులతో సన్మానించినారు. ఆర్టీసీ సేవలను కొనియాడారు. ప్రజలు, అత్యంత సురక్షిత, సుశిక్తులైన డ్రైవర్ లతో నడుపబడే ప్రజా రవాణాను ఆదరించాలని విజ్ఞప్తి చేసినారు. ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్, శ్రీనివాస్ , సూపర్ వైజర్ లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
