ద్రోణ సంగారెడ్డి Jul 25
ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగింది. నాందేడ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో.. బైక్పై ఉన్న ముగ్గురు యువకులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
