ఇప్పటివరకు మగవారే కానీ ఆడవారు కూడా నా
వివాహితను పెళ్లికూతురుగా ముస్తాబు
డబ్బులు నగల కోసం మోసం
కాకినాడ ద్రోణ:-
పెళ్లి పేరుతో మోసం చేశారని ఆరుగురిపై కాకినాడ ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లో మంగళవారం కేసు నమోదు చేశామని వారి వివరాలు ప్రకారం పెద్ద మార్కెట్ చెందిన టి కృష్ణమోహన్ కు పెళ్లి సంబంధం చూస్తామని శిరీష అని మహిళ చెప్పగా ఈ ఏడాది జూన్ 23న సత్యవేణి దుర్గ అనే ఇద్దరినీ మధ్యవర్తులుగా పరిచయం చేసి అదే రోజు ఆయనను రాజమహేంద్రవరం శివారులోని నామవరం తీసుకువెళ్లి నిరజ అనే మహిళను పెళ్లికూతురై గా మార్చి చూపించారు. ఆమెకు తల్లిగా సత్య దేవి అత్తగా ప్రియా దేవిని పరిచయం చేసి ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించి అతడు ఖర్చుల నిమిత్తం రూ:-, రేండూ వేయల ఎనబై లక్షల రూపాయలు ఓ చరవాణి బంగారు గొలుసు సత్యదేవి, ప్రియా దేవికి అందజేశాడు. కొద్ది రోజులకు అతనకు అనుమానం వచ్చి ఆరా తీయగా వారంతా మోసగత్తెలని తెలుసుకొని నిరజ కు అప్పటికే పెళ్లి అయ్యి సంతానం ఉన్నట్లు తెలుసుకొని బాధితుడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు వారికోసం దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.
