Tuesday, May 19, 2026

రౌడీ షీటర్ దారుణ హత్య?

ద్రోణ హైదరాబాద్:ఆగస్టు 09

హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ హత్య సంచలనం రేపుతోంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్‌సీఐ రోడ్డులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
పాతబస్తీ బాలాపూర్‌లో గ్యాంగ్‌స్టర్ రియాజ్ (39) పై కాల్పులు జరిగాయి. బైక్‌పై వెళుతున్న రియాజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వెంబడించి మరీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టి ఆపై కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ అక్కడి కక్కడే మరణించాడు. పాత కక్షల నేపథ్యంలోనే రియాజ్‌ పై దాడి చేసి చంపి ఉంటా రని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలా పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏఆర్‌సీఐ రోడ్డులో రియాజ్‌పై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు.ఘటనా అనంతరం నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.
ఘటనా స్థలం నుంచి బుల్లె ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాబా నగర్ సి బ్లాక్‌లో రియాజ్ నివాసం ఉంటు న్నాడు. గతంలో పలు హత్య కేసులతో పాటు పలు నేరాల్లో రియాజ్ ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. రౌడి షీటర్ చాకు నజీర్‌కు,రియాజ్ మధ్య గొడవలు ఉన్నట్టు సమాచారం. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో మృతుడు రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. కారంతో కలిపిన నీళ్లు రియాజ్ కళ్ళలోకి కొట్టి అతనిపై పిస్టల్‌తో కాల్పులు జరిపారు.
పోలీసులు ఈ కేసు దర్యా ప్తును కొనసాగిస్తున్నారు. రాచకొండ ఎస్ఓటి, హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular