ద్రోణ హైదరాబాద్
అనుమానాస్పద స్థితిలో ఆదివారం రాత్రి కూతురుతో కలిసి తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.నర్సింగ్ ఎస్సై హరికృష్ణ రెడ్డి,తెలిపిన వివరాల ప్రకారం భీమవరానికి చెందిన మానస (30) తన భర్త, కూతురితో కలిసి రంగారెడ్డి జిల్లా నార్సింగి లోని మైహోం అవతార్లో నివాసం ఉంటున్నారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి కూతురు కృషి(3)తో కలిసి 18వ అంతస్తుపై నుంచి దూకి మానస ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. మృతురాలు కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు.ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
