ఎడపల్లి ద్రోణ:-
బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో శ్రీ మాధవి విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కారస్పాండెంట్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఎంతో సంతోషంగా సంబరంగా మహిళలు జరుపుకునే పండుగ ఇలాంటి పండుగను మన పూర్వీకులు మనకిచ్చిన వరం వాటిని ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించాలి.

ఇలాంటి మన సాంప్రదాయాలు మన పద్ధతులు విద్యార్థులకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. మన తెలుగువారి సాంప్రదాయాల అనేవి ఎన్నో దేశా విదేశాలలో ఇప్పటికీ జరుపుకుంటున్నారు. ఇలాంటి మన సాంప్రదాయాలను మన పిల్లలకు మన భావితరాలకు అందిస్తే ఎంతో బాగుంటుందని అలాగే మన పండుగల విశిష్టత గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఉదయాన్నే లేచి పువ్వు పువ్వు కోసుకొని బతుకమ్మను పేర్చి పాటలతో కోలాటాలు వేస్తూ సంబరాలు జరుపుతూ ఉంటే అది ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని ఆయన అన్నారు. అదేవిధంగా శ్రీ మాధవి విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మాధవి సురేష్ గౌడ్, వెంకటలక్ష్మి, జయలక్ష్మి, స్వప్న, అమృత, కళ్యాణి, జ్యోతి, విజయలక్ష్మి, సంగీత, స్వర్ణ లత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
