దసరా పండగలోపు డీఎస్సీ నియామక పత్రాలు అందజేత… సీఎం రేవంత్ రెడ్డి హామీ
ద్రోణహైదరాబాద్, అక్టోబర్ 04
ధాన్యం కొనుగోళ్లపై సీఎం స్పెషల్ ఫోకస్
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు సన్నాల పేరిట జరిగే గోల్మాల్ కు కట్టడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దసరా పండగలోపు డీఎస్సీ నియామక పత్రాలు అందజేత… సీఎం రేవంత్ రెడ్డి హామీ.అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశం
మొత్తం 11062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటన
అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచన. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని టీవీ
