హాజరైన పోచారం, సురేష్ షెట్కార్, కాసుల
ద్రోణ వర్ని

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ ,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , కాంగ్రెస్ పార్టీ నాయకులు,


మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతన చైర్మన్ శ్రీ సురేష్ బాబా కి మరియు పాలకవర్గ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వర్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిదిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

వర్ని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
