ద్రోణ బోధన్:-
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామం లో శనివారం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాఎన్ని కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు ప్రారంభించారు. రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధరను కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ దళారులను ఆశ్రయించి అమ్మకాలు చేపడితే దరతోపాటు తూకంలో మోసాలు జరగడంతో పాటు డబ్బు చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతాయని దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తమ పండించిన పంటలు తరలించే అమ్ముకోవాలని రైతులకు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవరావు పటేల్ మాజీ ఉప సర్పంచ్ దిగంబర్ పటేల్ మాజీ ఎంపీటీసీ హన్మంత్ పటేల్, షహజీ పటేల్ పౌడ రాజేష్ పటేల్, పెద్ద మల్లు, శంకర్, మారుతీ, తుకారం తాదితరులు పాల్గొన్నారు.
