Saturday, February 14, 2026

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్యేమదన్ మోహన్

ద్రోణ ఎల్లారెడ్డి

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని

నాగిరెడ్డి పేట్ మండలంలోని మల్తూమ్మద సొసైటీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం ప్రారంభించారు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పోందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు లేకుండా రైతులకు మోసం జరగకుండా తూకం వేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్యాడి క్లీనింగ్ మిషన్ లు కొనుగోలు చేసి రైతులకు ఆసరా గా నిలుస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే మదన్ మోహన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతులు సంతోషంగా ఉంటే గ్రామాలు, రాష్ట్రాలు, మన దేశం సుభిక్షంగా ఉంటుంది అని అన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టిన వారిపైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మాల్తూమ్మెద సొసైటీ ఛైర్మన్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,నాగిరెడ్డి పెట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులు, గ్రామా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular