దీపావళి పండుగను పురస్కరించుకొని పేకాట అడటం సర్వసదారనంగా మారింది.ఈ సందర్భంగా పేకాట నియంత్రనకు పోలీసులు నిఘా కట్టుదిట్టంగా పెట్టారు.ఇందుకు సంబందించిన వివరాలను జిల్లా ఇంచార్జ్ కమీషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మూడు డివిజన్ లలో మొత్తం 116 కేసులు,597 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూపాయలు 11,47,240 లను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.దీపావళి పండగ సందర్భంగా పేకాట స్తావరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా,ప్రత్యేక టీమ్స్,కంట్రోల్ రూమ్స్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
