Saturday, February 14, 2026

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే తోట

ద్రోణ జుక్కల్ ప్రతినిధి:-

జుక్కల్ నియోజకవర్గం రైతుల పండించిన సోయా వరి పంటల కొనుగోలు వెంటనే చేపట్టి రైతులకు ఇబ్బందులు కలగకుండ్డ చూడాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ని కలిశారు.ఈ సందర్భంగా రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్స్ పై సబ్సిడీ ఇవ్వాలని మంత్రి ని కోరారు.వరి మరియు సోయా కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా సోయా ఎకరానికి 8 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో పాటు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ఉన్నారు.

పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని మంత్రి ని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular