Saturday, February 14, 2026

నవంబర్ చివరి వరకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నమోదుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇవ్వాలి

ద్రోణ నిజామాబాద్:-

నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఈనెల 6 వ తేదీ వరకు ఓటర్ నమోదు ముగిస్తున్నందున 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు మరింత ఓటును నమోదు చేసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ నవంబర్ చివర వరకు అవకాశం ఇయ్యాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ను కోరుతున్నామని అన్నారు.
ఓటర్ కొరకు అవకాశం ఉండి ఇతర కారణాల వల్ల నమోదు చేసుకొని వారు తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు బి.రఘురాం, హనుమాన్లు, టోకు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular