Saturday, February 14, 2026

ఆధ్యాత్మిక మార్గమే ప్రజలకు మోక్షం

ద్రోణ కోటగిరి

ఆధ్యాత్మికత భావన పెంపొందించుకోవడంతోనే ప్రజలు సుఖశాంతులతో జీవనం గడపగలుగుతారని ఆధ్యాత్మికతను మరింత పెంపొందించుకోవాలని పోచారం పిలుపునిచ్చారు.
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రములో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి – సాయిబాబా దేవాలయము యంత్ర – విగ్రహ – ప్రతిష్ట మరియు మహకుంభాబిషేక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాలుపంచుకున్నారు.
18 నవంబర్ సోమవారం ఉదయం నుండి యంత్ర స్థాపన – విగ్రహ ప్రతిష్ట – ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి వారి కృప,కటాక్షాలు అందరిపై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular