ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
రాయపర్తి మండల కేంద్రంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పై గిరిజనల ఆధ్వర్యంలో మహాధర్నా
రాష్ట్ర మాజీ మంత్రి పాలకుర్తి ఇంచార్జి ఎర్రబెల్లి
కొడంగల్ నియోజకవర్గం లతచర్లలో గిరిజనులపై జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేయక తప్పడం లేదని, వారికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.బాధిత కుటుంబలకు న్యాయం చేయాలనీ సోమవారం రాయపర్తి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజన లు భారీ ధర్నా చేసి బాధిత కుటుంబలకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో ఫార్మసిటీ భూమి సేకరణ లో భాగంగా అన్యాయంగా గిరిజనుల భూమిని లక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి, అక్కడ విఫలం అయి అమాయక గిరిజనుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు
బాద్యుల పైన ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం లో ముఖ్య అతిధిగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, గిరిజనులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
