Saturday, February 14, 2026

కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

ద్రోణ జగిత్యాల ప్రతినిధి:-

జగిత్యాల జిల్లాలోని కస్తూరిబా పాఠశాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు.
పెంచిన డైట్ చార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయకపోవడం బాధాకరం అని అన్నారు.
కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయి. విద్యార్థులు అందరికీ పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కట్టి హామీలను వెంటనే అమలు చేయాలి.

ఈ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కెసిఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బ తీయకూడదన్నారు. విద్యార్థులకు అందించే ఆహారంలో ప్రభుత్వం రాజీ పోడకూడదన్నారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular