నిజామాబాద్ టౌన్ ప్రతినిధి ద్రోణ:-
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ మీసేవా కేంద్రం వద్ద ఆటో ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. సుభాష్ నగర్ లోని కాకతీయ ఒలింపియాడ్ లో విద్యార్థి కౌషిక్ 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు కంఠేశ్వర్ లోని మీసేవా కేంద్రం వద్ద సైకిల్ పై రోడ్డు దాటుతుండగా ఆటో బలంగా ఢీకొట్టింది. దీంతో కౌషి కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాలుడికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ప్రసాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పుడే పలువురు ఒత్తిడి తేవడం గమనార్హం.
