ద్రోణ బోధన్ ప్రతినిధి
జయరాజు వృత్తి ధర్మంలో ఎంతో నిబంధతతోపని చేశారని ఆయన సేవలు ఎన్నటికీ మరువలేమని గ్రామస్తులు కొనియాడి ఘనంగా సన్మానించారు.
సాలురా మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన బెల్లంకొండ జయరాజు కండక్టర్ గా బోధన్ డిపో లో పనిచేసి శనివారం ఉద్యోగ విరమణ పొందారు.గ్రామ మిత్రబృందం మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఘనంగా శాలువాతో పూలమాలతో సన్మానించారు. గతంలో 1984 నుండి 2001 వరకు 17 సంవత్సరాల పాటు ఆర్మీ సైన్యంలో పనిచేసి ఆ తర్వాత 2003 నుండి 2008 వరకు ఐదు సంవత్సరాలు పాటు దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ బోధన్ నందు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మల్లవరపు సుందర్ రాజు ,బెల్లంకొండ జోజయ్య, వైట్ల శ్రీనివాస్ రావు, షేక్ మజార్ అలీ ,వై రాములు కిషోర్, భాస్కర్ ,సంజు, ఆరోగ్య రాజు, కే సురేష్, పడాల నరేష్, కుమార్ ,చంద్రం, హోటల్ లక్ష్మణ్ జితేందర్ ,కరామత్ అలీ, డిష్ రాజు, సాయి, చిన్నయ్య ,తదితరులు పాల్గొన్నారు.

