తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొని తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల స్మృతికి పుష్పాంజలి ఘటించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ఈరోజు మనం స్మరించుకుంటూ
అవతరించిన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది అని మంత్రి అన్నారు.

















