ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన మధుయాష్కి గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్ నాంపల్లి గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను మధుయాష్కి స్మరించుకుంటూ, వారి త్యాగాలు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

