ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేరికలు
నసురుల్లాబాద్ మండలం బొప్పస్ పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల ప్రెసిడెంట్ బలరాం సింగ్ ఆదివారం యువనాయకులు నరేష్ రాథోడ్ ఇంటి వద్ద ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలనలో అమలు చేస్తున్న పథకాలను చూసి అభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీ లో చేరుతున్నట్టు బలరాం సింగ్ తెలిపారు. నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నందు టీపీసీసీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తకొండ భాస్కర్ మాజీ ఎంపీపీ బజ్జ నాయక్ మంత్రి గణేష్ తదితరులు ఉన్నారు.
